online marketing

Wednesday, December 30, 2009

ప్రతిభచూపిన డిఎల్‌ఎన్‌ఆర్‌ విద్యార్ధులు

బుచ్చిరెడ్డిపాళెం, మేజర్‌న్యూస్‌ :బుచ్చి స్థానిక దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన మలవతు సుబ్బయ్య స్మారకక్రీడా పోటీలలో స్థానిక దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అద్భుత ప్రతిభ చూపారు. బుచ్చి ఎస్‌ఐ సుబ్బారావుచే అట్టహాసంగా ప్రారంభింపబడిన ఈ క్రీడాపోటీలలో పట్టణంలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనగా 100, 200, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌ క్రీడాంశాలలో మొదటి, రెండవ స్థానాలు డిఎల్‌ఎన్‌ఆర్‌ పాఠశాల విద్యార్ధులు కైవశం చేసుకున్నారు. మిగిలిన పాఠశాల విద్యార్ధులు మూడవ స్థానాలకే పరిమితమయ్యారు. ఈ క్రీడాపోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఈ కార్యక్రమంలో కొడవలూరు తహసీల్దార్‌, క్రీడాపోటీల నిర్వాహకులు అయిన మలవతు సుధాకర్‌, డిఎల్‌ఎన్‌ఆర్‌ ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు మధు, ఏసు దానమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు నెట్‌లో పంపుతారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh