online marketing

Monday, December 28, 2009

మహానుభావులు స్థాపించిందే కాంగ్రెస్‌పార్టీ

వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఎందరో మహానుభావులచే స్థాపించబడిందే కాంగ్రెస్‌పార్టీ అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగువేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఇందిరాభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్లసిరి మాట్లాడుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్ర్తి, మౌలానా అజాద్‌, ఇందిరాగాంధీ లాంటి ఎందరో మహానుభావులు చేసిన కృషి వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం మొత్తం తలకిందులైనపుడు అప్పటి ప్రధాని పివి.నరసింహరావు, అప్పటి కేంద్ర ఆర్థిక మంద్రి మన్మోహన్‌సింగ్‌లు ఆర్థిక సంస్కరణల వల్ల ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా మనదేశాన్ని నిలబెట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు.పదవుల కంటే పార్టీయే ముఖ్యమని ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి కాంగ్రెస్‌పార్టీని పునరుజ్జీవనం చేసిన మహానాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు. ఆమె నాయకత్వాన కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఇంత ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో తాము ఉన్నందుకు గర్వపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాదులందరూ గర్వపడుతూ ఆ మహానాయకుల అడుగుజాడల్లో నడచి ఈ దేశానికే మరింత సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి ఉడతా వెంకటరావు, బిసి సెల్‌ ఉపాధ్యక్షులు కె.రఘురాంముదిరాజ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ టి.బాలసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh