online marketing

Friday, November 27, 2009

భారీగా సెల్‌ఫోన్లు స్వాధీనం

రాపూరు: కొంత కాలంగా సెల్‌ఫోన్‌ దొంగతనాలు, పోగొట్టుకున్న సెల్‌ఫోన్లపై నిఘాపెట్టి గాలిస్తుండగా గురువారం 63సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని ముగ్గురిను అరెస్ట్‌ చేసినట్లు రాపూరు ఎస్‌ఐ యు జయరావ్‌ గురువారం తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు రాపూరులో సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు తమకు అందిన సమాచారం మేరకు నిఘాపెట్టి కొప్పల కిషోర్‌, రేవూరి నాగరాజు, రేవూరి రవి అనే వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుండి సెల్‌ఫోన్లతోపాటు ఒక సైకిల్‌, ఆటో బ్యాటరీ, రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కసారిగా రాపూరు పట్టణంలో పోలీసులు దాడులు చేసి సెల్‌ఫోన్లు పట్టుకోవడంతో స్టేషన్‌ ఆవరణం బాధితులతో నిండిపోయింది. పోగొట్టుకున్నవారు ఎస్‌ఐ వద్దకు చేరారు. దీంతో ఆయన విచారించి కొందరివి సెల్‌ఫోన్లు వారికి అందజేశారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh