online marketing

Friday, November 27, 2009

జాబితాలో ఒకే కుటుంబానికి 11 రేషను కార్డులు

కోట: స్థానిక శ్యామ సుందరపురంలో ఒకే వ్యక్తికి ఏకంగా 11 రేషను కార్డులు మంజూరు చేసినట్లు బోగస్‌ రేషన్‌ కార్డుల సర్వేలో వెల్లడైంది. కోటలోని శ్యామసుందరపురంలో గురువారం రేషను కార్డులను జాబితా ప్రకారం సర్వే చేస్తుండగా జాబితాలోని ఉద్దంటి పెంచలబాబు కుటుంబానికి వరుసగా 11 రేషన్‌ కార్డులున్నట్లు జాబితాలో ఉండడంతో సర్వే చేస్తున్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. సర్వే చేస్తున్న సమయంలో తనిఖీ కోసం వచ్చిన తహసీల్దార్‌ శ్యామ్‌ వరప్రసాద్‌ అవకతవకల జాబితాను పరిశీలించారు. అదేవిధంగా చింతలపల్లి బుజ్జయ్య అనే కుటుంబ యజమాని పేరుతో ఆరు రేషను కార్డులు జాబితాలో ఉండడం విశేషం. కంప్యూటర్‌లో జాబితాలు తయారు చేయడంలో పొరపాట్లు జరగడం వల్లనే ఈ విధంగా జరిగి ఉండవచ్చని తహసీల్దార్‌ పేర్కొన్నారు. దీనికి ఒక కార్డు మాత్రమే గుర్తింపు ఇచ్చి మిగిలిన వాటిని రద్దు చేస్తామన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh